
పుష్ప టు విడుదల సమయంలో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి ఆ తర్వాత ప్రెస్ మీట్ రచ్చ రచ్చ జరిగాక మొదటిసారి అల్లు అర్జున్ వేవ్స్ అనే కార్యక్రమంలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.ఇందులో భాగంగా ఎన్నో రోజుల నుండి మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ దూరం పెడుతున్నారు అనే రూమర్స్ కు కూడా తెర దించారు.మా మామయ్య చిరంజీవి నాకు స్ఫూర్తి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటీ చెప్పారు. అలాగే నా అభిమానుల కారణంగానే నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాను అని కూడా అభిమానులను పొగుడుతూ కామెంట్స్ చేశారు. అయితే ఇదే వేవ్స్ కార్యక్రమంలో మీడియా ఛానల్ వాళ్ళు అల్లు అర్జున్ తో ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అయితే ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.