టాలీవుడ్ స్టార్ యాంకర్ రష్మీకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరించడం ద్వారా రష్మీ ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు. పలు సినిమాలలో రష్మీ హీరోయిన్ గా నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అయితే అందుకోలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
కొంతకాలం క్రితం రష్మీ భుజానికి గాయం కావడంతో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల 18వ తేదీన రష్మీకి ఆపరేషన్ జరగగా అదే నెల 24వ తేదీన ఆమె బాలీ ట్రిప్ కు వెళ్లారు. అయితే రష్మీ ట్రిప్ కు వెళ్లడం గురించి తన వంతు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండు నెలల ముందే ఈ ట్రిప్ ఫిక్స్ కావడంతో నేను క్యాన్సిల్ చేయలేకపోయానని రష్మీ వెల్లడించడం గమనార్హం.
 
రష్మీ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే. నడిచే అవకాశం లేకపోయినా వీల్ ఛైర్ లో తాను వెళ్లానని చెబుతూ అందుకు సంబంధించిన వీడియోను రష్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం గమనార్హం. ఈ ట్రిప్ కు వెళ్లడం వల్ల తన తల్లి లైఫ్ లాంగ్ తనను దెప్పిపొడిచే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రష్మీ తాను ట్రిప్ కు వెళ్లినా అక్కడ బీచ్ లో స్నానం కూడా చేయలేకపోయానని రష్మీ వెల్లడించారు. రష్మీ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారూ. రష్మీ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. రష్మీ తన స్నేహితురాళ్లలో కలిసి ఈ ట్రిప్ కు వెళ్లారు. రష్మీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటించాలని అభిమానులు ఫీలవుతున్నారు. రష్మీని అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: