
దీంతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ పై అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రముఖ నిర్మాతగా టాలీవుడ్ లో పేరుపొందిన బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మొదటిసారి అల్లుడు శీను సినిమాతో 2014లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ తన నటనతో డాన్స్ తో ఫైట్లతో ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఆ తర్వాత జయ జానకి నాయక, రాక్షసుడు తదితర చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. గతంలో హిందీలో చత్రపతి సినిమాని హీరోగా రీమిక్స్ చేసినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం భైరవం, హైందవ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. భైరవం సినిమా ముగ్గురు మల్టీ స్టార్లర్ హీరోలుగా నటిస్తూ ఉన్నారు. మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తూ ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరి ఈ చిత్రాలతో నైనా సక్సెస్ లను అందుకుంటారేమో చూడాలి మరి.