టాలీవుడ్ ఇండస్ట్రీ లో తమకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ , నారా రోహిత్ తాజాగా విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మే 30 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. మంచి గుర్తింపు కలిగిన ముగ్గురు హీరోలు నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ సినిమాకు ఏకంగా 16.20 కోట్ల ప్రీత్ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 17 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి రెండు రోజుల్లో నైజాం ఏరియాలో 1.22 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 48 లక్షల దక్కాయి. ఆంధ్ర లో 1.41 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని ఈ మూవీ కి 50 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 3.61 కోట్ల షేర్ ... 6.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 17 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 13.39 కోట్ల కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. మరి ఈ సినిమా చేసి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: