పాన్ ఇండియా హీరో ప్రభాస్ , డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న ‘ది రాజాసాబ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హైప్‌ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే .. ఇక ఈ సినిమాని పూర్తి హారర్ కామెడీ జోనర్ చిత్రం గా మారుతి ఎంతో ప్రెస్టేజెస్ గా రూపొందిస్తున్నాడు .. తాజా గా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేయక దానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది . ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాల తో రాజా సాబ్ టీజర్ అభిమానులను మెప్పిస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించి జరుగుతున్న బిజినెస్ కూడా ప్రేక్షకుల ను , సినీ వర్గాల ను షాక్ గురిచేస్తుంది ..

తాజాగా రాజా సాబ్ సినిమా కి సంబంధించిన ఆడియో రైట్స్ సుమారు  రూ . 20 కోట్లకు అమ్ముడైపోయినట్టు తెలుస్తుంది .  ప్రముఖ టి సిరీస్ సంస్థ రాజా సాబ్ ఆడియో రైట్స్ ను భారీ మొత్తాని కి కొనుగోలు చేసింది .. అలాగే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా బయటి కి రాలేదు .. అయినా కూడా అప్పుడే ఈ స్థాయి లో ఆడియో రైట్స్ అమ్ముడై పోవటం అంటే మామూలు విషయం కాదు .  ఇక ఈ సినిమా లో వింటేజ్ ప్రభాస్ తన లుక్స్ తో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు .  అలాగే ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ వంటి వారు ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు .. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు .

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: