
దీనిని మెగా ఫ్యాన్స్ సీరియస్గా తీసుకున్నారు . ఆయనకి వార్నింగ్ ఇస్తూ లేఖ కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ లేఖ ఎంత వైరల్ అయింది అనేది కూడా అందరికీ తెలిసిందే . కాగా ఫైనల్లీ శిరీష్ రెడ్డి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సారీ చెప్పారు . "నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ అంటూ బహిరంగ క్షమాపణలు చెప్పారు." దీంతో ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది అనుకున్నారు. కానీ కాలేదు ముందుంది ముసలి పండుగ అంటూ తాజాగా ఓ న్యూస్ తెర పై కి వచ్చింది .
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ ప్రాజెక్ట్ తమ్ముడు . నితిన్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. నితిన్ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టిందే లేదు . ఈ సినిమా హిట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ . రిలీజ్ అయిన ట్రైలర్ ఇప్పటివరకు చేసిన ప్రమోషన్స్ అన్ని కూడా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేసేలా చేసింది. కానీ తాజాగా శిరీష్ మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్ ని డీప్ గా హర్ట్ చేసాయ్ . ఆ కారణంగానే కొంతమంది మెగా ఫాన్స్ నితిన్ తమ్ముడు సినిమాని ఫ్లాప్ చేస్తామంటూ మాట్లాడుతున్నారు .
దీంతో నితిన్ ఫాన్స్ కూడా రంగంలోకి దిగారు. వాళ్లు వాళ్లు కొట్టుకొని మా హీరో సినిమా ని ఎందుకు ఫ్లాప్ చేస్తారు..? మీరు ప్లాప్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..? అంటూ రివర్స్ కౌంట్ర్స్ వేస్తున్నారు . అయితే ఇలా ఫ్యాన్స్ గొడవలు పడకుండా దిల్ రాజు ముందుగానే పరిస్థితి చక్కదిద్దడానికి రామ్ చరణ్ చేతే తమ్ముడు సినిమాని చూడాలి అనే విధంగా ఒక ప్రమోషన్ వీడియోని చేయించబోతున్నారట . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది
. చూడాలి మరి దిల్ రాజు కోరికను రామ్ చరణ్ తీరుస్తాడో..? లేదో..? నితిన్ సినిమాకి సపోర్ట్ చేస్తూ ప్రమోషన్ వీడియోని రిలీజ్ చేస్తాడో..? లేదో..?