టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతగా సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరుపొందిన అల్లు అరవింద్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఉన్నది. అలాగే ఆహా ఓటీటి ద్వారా మరింత ఎంటర్టైన్మెంట్ ని పంచడానికి సిద్ధమయ్యారు. అయితే తాజాగా అల్లు అరవింద్ ఈడి విచారణకు హాజరైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామకృష్ణ బ్యాంకు కుంభకోణం కేసులో అల్లు అరవింద్ సైతం ఈడీ అధికారులు సుమారుగా మూడు గంటల పాటు విచారించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా 2018- 19 మధ్యలో జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను సైతం అడిగిమరి తెలుసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ నుంచి 101 కోట్ల రూపాయల రుణాలను రామకృష్ణ ఎలక్ట్రిక్ బ్యాంక్  తీసుకున్నారట అయితే ఈ రుణాలను తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో సిబిఐ కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ఈ కేసు ఆధారంగానే ఇప్పుడు వీడి అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారట.


రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఏదైనా విషయం పై అరవింద్ కు ఏదైనా  సంబంధం ఉందా లేదా అనే కోణంలో విచారించినట్లుగా తెలుస్తోంది. అయితే విచారణ అనంతరం మళ్లీ తిరిగి వచ్చేవారం అల్లు అరవింద్ విచారణకు హాజరు కావాలని మరొకసారి అధికారులు సూచించారట.ఈ పరిణామం ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయంశంగా మారుతున్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అల్లు అరవింద్ కుటుంబం తెలియజేస్తుందేమో చూడాలి.


అల్లు అరవింద్ ఒకవైపు నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. గత కొంతకాలం నుంచి అటు అల్లు ఫ్యామిలీకి సైతం ఏదో ఒక విధంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉండడంతో అభిమానులు తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు. పుష్ప 2 సినిమా నుంచి మొదలు ఏదో ఒక విధంగా ఆల్లు కుటుంబం పేరు వినిపిస్తోంది. మరి ఇక మీదటనైనా ఇలాంటివి జరగకుండా చూసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: