సోషల్ మీడియా లో ఏ  పోస్ట్ పెట్టిన సరే సెకండ్స్ లోనే ట్రెండ్ అవుతూ ఉంటుంది .. వైరల్ అవుతూ ఉంటుంది . ఇక స్టార్ సెలబ్రెటీస్ పెట్టే పోస్ట్ కామన్ పీపుల్ పై ఎలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  తాజాగా అడవి శేష్ కజిన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . ఆ పోస్ట్ వైరల్ గా మారింది.  దీనిపై జనాలు తమ అభిప్రాయాన్ని ఓపెన్గానే చెప్పుకొస్తున్నారు. డైరెక్టర్ అడవి సాయికిరణ్ గురించి అందరికీ తెలిసిందే . యంగ్ హీరో అడవి శేషు కజిన్.  ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.


మరీ ముఖ్యంగా నటుడు కృష్ణుడు నటించిన "వినాయకుడు" మూవీతో దర్శకుడుగా అరంగేట్రం చేశారు . కాగా ఆ తర్వాత విలేజ్ లో వినాయకుడు సినిమా .. ఆ తర్వాత రొమాంటిక్ ఎంటర్టైనర్ "కేరింత" మూవీ తీశారు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ షేర్ చేశారు . అడవి సాయికిరణ్ పేరు వార్తల్లో ఆ పోస్టు నిలిచేలా చేసింది . బైబిల్ , భగవద్గీతను పోస్టులో ప్రస్తావించడం ఇంకా హైలైట్ గా మారింది . ఆయన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది .

"కొందరు బడా ప్లాట్ఫారం నిర్వాహకులు.. తనకు ఫోన్ చేసి సినిమా నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పినట్లు ఆయన తెలిపారు..  అంతేకాదు తాను కూడా ఓకే అన్నాను అని అప్పుడు వారు బైబిల్ (బౌండ్ స్క్రిప్ట్) కావాలి అని అడిగారు అని నేను వెంటనే తాను బైబిల్ కాదు భగవద్గీత ఇస్తానని బదులిచ్చాను అని పేర్కొన్నారు. అంతే కాదు తాను గర్వంగా చెప్పుకునే హిందువునని కూడా మెన్షన్ చేశారు  అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. "మతాన్ని సృజనాత్మకతలోకి ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను హిందువుని సినిమా నిర్మాణంలో అలాంటి మతపరమైన మాన్యూపులేషన్ పద్ధతులను అనుమతించను నేను వారి ఆఫర్ ని తిరస్కరించాను జైశ్రీరామ్" అంటూ కూడా అడవి సాయికిరణ్ తెలిపారు . దీంతో ఆయన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: