మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 8 వసంతాలు మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఒక ప్రేమ జంట జీవితంలోని 8 సంవత్సరాల ప్రయాణం గురించి ఈ సినిమా తెరకెక్కింది.

రవితేజ దుగ్గిరాల,  హనురెడ్డి ప్రధాన పాత్రల్లో  ఫణింద్ర నరిశెట్టి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.  తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుంది.  రొమాంటిక్  డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా గత నెలలో  థియేటర్లలో  విడుదలై ప్రేక్షకులను  మెప్పించే విషయంలో  ఫెయిలైంది.  ఈ సినిమాలో హీరోయిన్ రచయిత పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.  
 
మార్షల్ ఆర్ట్స్ లో సైతం  ఆమె ప్రావిణ్యం సాధిస్తారు.  మైత్రీ నిర్మాతలకు  ఈ సినిమా మంచి లాభాలను అందించింది.  కొన్ని వివాదాలలో చిక్కుకోవడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ కాగా  మరో విధంగా మైనస్ అయింది.  8 వసంతాలు సినిమాకు  ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.  8 వసంతాలు మూవీలో కథ, కథనం పరంగా ఆసక్తికర ట్విస్టులు ఉండటం గమనార్హం.

  8 వసంతాలు మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందని చెప్పవచ్చు.  సినిమాలో వరుణ్,  సంజయ్ పాత్రలకు  సంబంధించి  చోటు చేసుకునే మలుపులు ఆకట్టుకున్నాయి. దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే  ఈ సినిమాకు  ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. 8 వసంతాలు సినిమా   నాటిక సనీల్ కుమార్ కు ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది.   మైత్రీ  నిర్మాతలు తెలివిగా అడుగులు వేస్తూ విజయాలను అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: