నట‌సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు .. వరుస విజయాలతో కెరియర్లో ఎవరు అందుకోలేని ఎత్తులో ఉన్నారు బాలయ్య .. ప్రజెంట్ బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాకు సిక్వల్ గా అఖండ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చింది .. సెప్టెంబర్ 25న దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . అయితే బాలయ్య అఖండ 2 తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చింది .. ఆ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం తో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది ..
 

అయితే వీరసింహారెడ్డి సినిమా టైమ్ లోనే బాలయ్య గోపీచంద్ తో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు . ఇక ఇప్పుడు ఆ మాట ప్రకారమే గోపీచంద్ , బాలయ్య మరో సినిమా చేయబోతున్నారు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన  అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది .. బాలయ్య కెరియర్లో 111వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా గురించి రీసెంట్ గానే అమెరికాలో జ‌రిగిన తానా సభల్లో గోపీచంద్ మాట్లాడుతూ ఈ సినిమాలో బాలయ్యను ఇప్పటివరకు చూడని కొత్త యాంగిల్ లో చూపించబోతున్నాని సినిమాపై అంచనాలు పెంచిన విషయం తెలిసిందే .



ఇప్పటికే భారీ అంచనాలతో రాబోయే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది .. ఈ సినిమాల్లో కీలక పాత్రలో నటించడానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇద్దరు ప్రముఖ నటులతో డిస్కషన్ మొదలు పెట్టారని తెలుస్తుంది .. అయితే ఆ నటులు ఎవరినేది ఇంకా తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తుంది .. ఇవన్నీ చూస్తుంటే గోపీచంద్ ఈసారి వీర సింహారెడ్డిని మించి మరో సినిమాను బాలయ్యతో ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: