తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతిరోజూ ఏదో ఒక న్యూస్ వైరల్ చేస్తూ ఈ చిత్రంపై మరింత క్యూరియాసిటీ తీసుకు వచ్చారు. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ కొన్ని సీన్లు ఉన్నాయని టీడీపీ శ్రేణులు గగ్గోలు పెట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించడంతో.. టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి. కోర్టులో కేసులు కూడా వేశారు..కానీ అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్రం విడుదలను ఆపేయాలని శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు.
దాంతో ఈ చిత్రాన్ని ప్రదర్శించే ముందు తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.ఈ నేపథ్యంలో, ఈరోజు ఎన్నికల సంఘం ముందుకు రాకేష్ రెడ్డి హాజరుకానున్నారు.