ప్రముఖ టీవి నటి రాగమాధురిపై ఆమె హెయిర్ డ్రెసర్ జ్యోతిక దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన పై బంజారా హిల్స్ పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని టీవి సీరియల్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఈ సిరియల్ లో ముఖ్య భూమిక పోషిస్తున్న రాగ మాధురికి సంబంధించిన బంగారు గొలుసు రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయింది.
ఆమె సెట్ లో తన సహనటులను అడిగి ఆరా తీసినప్పటికీ గొలుసు జాడ కనిపించలేదు. దాంతో ఆమెకు తన హెయిర్ డ్రెసర్ జ్యోతిక మరో ఇద్దరిపై అనుమానం రావడంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో జ్యోతికను పోలీసులు విచారణ కోసం స్టేషన్ కి తీసుకు వచ్చారు. అయితే మాధురి గొలుసు కారులో దొరికిందంటూ సెట్ లో ఉన్నవారు తీసుకు వచ్చి పోలీసులకు అప్పగించారు..అక్కడ ఉన్న జ్యోతికను తీసుకు వెళ్లారు. ఈ ఘటనతో జ్యోతిక ఎంతో అవమానించారని ఆవేదన చెంది ఆగ్రహం తెచ్చుకుంది.
మాధురికి బుద్ది చెప్పాలని..తన ఎనిమిది మంది అనుచరులతో షూటింగ్ స్పాట్ వద్దకు వెళ్లి ఆమెపై దాడికి పాల్పపడింది. కాగా, తనపై దాడి నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులకు రాగమాధురి మరోమారు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.