బాహుబలి, బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తరువాత ప్రభాస్ సాహో సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో విడుదల కాబోతుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్ ఈ సినిమాలో ప్రభాస్ కు జొడీగా నటిస్తుండగా యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతదేశంలో ఏడు వేల థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో సాహో సినిమా విడుదల కాబోతుందని సమాచారం. 
 
సాహో సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ ప్రభాస్ బాహుబలి సిరీస్ డైరెక్టర్ రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. బాహుబలి సిరీస్ సినిమాలతోనే ఇండియా అంతటా క్రేజ్ పెరిగిందని, రాజమౌళి చేసిన మాయ బాహుబలి సిరీస్ అని, బాహుబలి క్రెడిట్ అంతా రాజమౌళికే అని అన్నాడు ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి తరువాతే సాహో సినిమా వస్తున్నందువలన ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ లో ఉన్నాను అని ప్రభాస్ వ్యాఖ్యలు చేసారు. 
 
దాదాపు 350 కోట్ల రుపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కు కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ప్రీ రిలీజ్ టాక్ ప్రకారం ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినట్లే అని తెలుస్తుంది. ప్రభాస్ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. 
 
సినిమాలోని చివరి అరగంట అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. చివరి అరగంటలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ మొదలుకాగా బుక్ మై షో లాంటి వెబ్ సైట్లలో ఆదివారం వరకు టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. తొలిరోజు ఈ సినిమా 120 కోట్ల రుపాయలు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: