పెద్దగా ఓదార్పు ఇవ్వడం లేదు.
సినీ నటి రోజా మళ్లీ గొడవల్లో ఇరుక్కుకున్నారు. పార్టీలో ఆమె ఇదివరకు కన్నా యాక్టివ్ అయినప్పటికీ అనుకున్న ఫలితాలు అందుకున్నప్పటికీ అసమ్మతి స్వరాలను నియంత్రించలేకపోతున్నారు. చిత్తూరు జిల్లాలో తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులను ఢీ కొన లేకపోతున్నారు. తరుచూ వివాదాల్లో ఇరుక్కుపోయి, కన్నీళ్లు పెట్టుకోవడం మినహా సాధించిందేమీ లేదు అని కూడా తెలుస్తోంది. స్థానిక పోరు కూడా ఇలానే సాగిందని తెలుస్తోంది.
తన మాట నెగ్గించుకున్న దాఖలాలు ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి హవా ముందు అవి వెలవెలబోయాయి. కొన్ని చోట్ల ఆమె వెనక్కు తగ్గేందుకు సైతం చేసేలా పెద్ది రెడ్డి అనుచరులు వ్యూహాలు పన్నారు. తాజాగా ఎంపీపీ ఎన్నికల పోరు కూడా ఇలానే సాగింది. నిండ్ర మండల ఎంపీపీ వివాదం చాలా తీవ్రతల మధ్య వాయిదాపడింది. పెద్ది రెడ్డి మనుషులు తమ మాటే నెగ్గాలని పట్టుబట్టడంతో ఇరు వర్గాలూ కొట్టుకునేదాకా వెళ్లేయని సమాచారం.దీంతో ఎన్నిక వాయిదా పడినా, సమస్యకు రోజా చెబుతున్న పరిష్కారం వర్కౌట్ కావడం లేదు. గ్రామాల్లో తన పరువును నిలుపుకునే పనులకు ప్రాధాన్యం ఇస్తూ తరుచూ పడుతున్న గొడవలను పెంచుకుంటూ పోతున్నారు.