ఇండియా కి సంబంధించి జరిగే గొడవలు అన్నిటిలోనూ దాదాపు పాకిస్థాన్ హస్తం ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. కానీ తాజాగా జరిగిన కాశ్మీర్ గొడవలలో ఎంతవరకు పాకిస్తాన్ హస్తం ఉంది అన్నది ప్రశ్నార్ధకంగా ఉన్నట్టు కాంగ్రెస్ వాళ్ల వాదన ఉండగా, లేదు ఇది ఖచ్చితంగా కశ్మీర్ పాకిస్తానీలు చేయించిన పని అని అజిత్ దోవల్ స్పష్టంగా నిర్ధారించడం జరిగింది. మీరు గనక ఇంట్లోనే కూర్చుని ఎటువంటి గొడవలు పెట్టకుండా మౌనం వహిస్తే మీకు మేము ఇస్తాము అని బెదిరించారు అట.

అల్లర్లు అనేవి సృష్టించ కాకపోతే అంతా బానే ఉంది అనుకుని రాజకీయ నాయకులు అందరూ ఈ విషయాన్ని మరిచి పోతారు అన్న విషయం అందరికీ తెలిసినదే. అందుకే ఏ గొడవ జరగకుండా శాంతంగా ఉంటే ఆ పాలన చాలా బాగా జరుగుతుంది అని ప్రతిపక్షం వాళ్లకు ప్రభుత్వాన్ని ఎత్తి చూపించే అవకాశం రాదు కనుక ఇటువంటి ప్రతిపక్షం వారు కూడా చేస్తూ ఉంటారు మరియు ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా చేస్తూ ఉంటారు. పరాయి దేశం ఎంత చిన్నాభిన్నం అయితే మిగిలిన దేశాలకు అంత బలం చేకూరుతుంది.

అందులోనూ ఇక కాశ్మీర్పై పాకిస్థాన్ కి ఎటువంటి హక్కు ఉండకుండా ఏకంగా ఆర్టికల్ 370 మినహాయించడం పై తీవ్రంగా అల్లర్లు సృష్టించి లేకపోతే ఇది మార్చడానికి ఇక జీవితంలో ఎప్పుడూ సులువు కాదు అని అనుకుంటారు. దీంతో మీరు ఎటువంటి అల్లర్లు చేయకపోతే గనుక మీకు గాజులను గిఫ్ట్ గా ఇస్తాము అని కశ్మీరు వాసులను బెదిరించినట్టు అజిత్ దోవల్ కు కచ్చితమైన సమాచారం ఉందట.

దాదాపుగా రెండు వందల ముప్పై టెర్రరిస్టులను తయారుచేసి కశ్మీర్లో కి చొరబడేందుకు పాకిస్తాన్ సిద్ధం చేస్తోంది అని దీన్ని తిప్పికొట్టడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని భారతదేశం ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మరొకసారి అందరికీ ఘంటాపధంగా హామీలు అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: