ఎన్నో దశాబ్దాలు మరియు తరాలు మారుతూ వస్తున్నా.... మన దేశంలోని ఆడవారికి రక్షణ మరియు గౌరవం కరువైపోయింది. మరీ ముఖ్యంగా ఎవరి ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదో వారిని ఎంచుకొని పని ఉంది అని చెప్పి ఇతర దేశాలకు తీసుకుని వెళ్లడం అక్కడ డబ్బున్న వారికి అమ్మివేయడం వంటి ఉదంతాలు ఎన్ని తరాలు మారినా తగ్గట్లేదు. ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన కొంత మంది మహిళలను గల్ఫ్ దేశానికి తీసుకొని వెళ్ళిన ఏజెంట్లు అక్కడి నుండి కొంతమంది డబ్బున్న వారికి వారిని అమ్మివేస్తున్నట్లు వచ్చిన ఒక రికార్డింగ్ ఇప్పుడు సంచలనం రేపుతోంది.

 

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ ఏదోరకంగా ఒక సెల్ ఫోన్ సంపాదించి తన వాయిస్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె తన ఏజెంట్ యొక్క పేరుని చెప్పి అతను తనతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన చాలా మంది అమ్మాయిలను ఇలాగే కొంత మంది ఏజెంట్ లు పని ఉంది అని చెప్పి దుబాయ్ కు తీసుకొనివచ్చి దాని తర్వాత అక్కడి నుండి కువైట్ కు అక్రమంగా తరలిస్తున్నాడు అని వాపోయింది. తాము ప్రస్తుతం కువైట్ ఎంబసీ లో ఉన్నామని చెప్పిన ఆమె ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని "అన్నా..." అని సంబోధిస్తూ వారిని త్వరగా చెర నుండి విముక్తి పరచాలని కోరింది.

 

ఇకపోతే ఆమె కన్నీటి గొంతుతో ప్రాధేయ పడుతూ ఇక్కడ ఉన్న దుబాయ్ షేక్ ఒంటి కింద తాము ఇప్పటికే చాలా నలిగిపోయి ఉన్నామని.. వారి పాస్ పోర్ట్ లను కూడా వారికి తిరిగి ఇవ్వకుండా బంధించి కువైట్ కు తరలించేందుకు సన్నాహాలు జరుపుతున్నారు అని ఆమె చెప్పింది. అందులో ఒక మహిళ అయితే తనకు కిడ్నీ ప్రాబ్లం ఉందని.. మరియు ఒక పసి బిడ్డ కూడా ఉందని చెప్పి వాపోయింది. వీరందరూ ముఖ్యమంత్రి జగన్ పైనే తమ ఆశలు పెట్టుకోగా జగన్ ప్రభుత్వం దీనిపై ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: