ఈ మద్య నేరస్థులు చాలా తెలివి నేర్చుకున్నారు.. ఎంతగా అంటే తాము ఏదైనా నేరం చేయాలంటే ముందుగా యూట్యూబ్ సర్చ్ చేసి అందులో తాము చేసే నేరాలకు ఎలాంటి ప్లానింగ్స్ ఉంటాయో తెలుగుసుకొని ఆ పథకాన్ని అమలు పరుస్తున్నారు. ఇలాంటి నేరాల గురించి తెలుసుకున్న తర్వాత పోలీసులే విసృతపోతున్నారు. తాజాగా ఓ యువతి కిడ్నాప్ అయితే.. కేవలం 10 గంటలోనే ఛేదించారు కడప జిల్లా పోలీసులు. మొదట నేరస్థుడు చేసిన పక్కా ప్లాన్ గురించి పోలీసులే ఆశ్చర్యపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ యువతిని దక్కించుకునేందుకు ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న ఓ వ్యక్తి పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేశాడు. అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
యువతి బెంగళూరులో ఉంటోందని తెలుసుకున్న కృష్ణమోహన్ అక్కడకు వెళ్లి ఆమెను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఆ యువతిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేరని పసికట్టిన ఈ కేటుగాడు ఆమెను బెదిరించిన బురకా వేయించి ఇంట్లోనుంచి తీసుకు వెళ్లాడు. ఆ యువతి వెళ్లడం చుట్టుపక్కల వారు గమనించి తండ్రికి తండ్రికి ఫోన్ చేయగా ఆయన వెంటనే ఇంటికొచ్చి చూశాడు. తన కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఓ టీమ్ను నెల్లూరుకు, మరో టీమ్ను తమిళనాడుకు పంపించారు.
ఆ యువతి వాడిన సెల్ ఫోన్ సిగ్నల్ తో వేలూరులో ఉన్నట్లు గుర్తించి కిడ్నాపర్ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్ చేయడానికి ముందు అతనితో పాటు ఓ అస్తిపంజరం.. కొవ్వొత్తి, పెట్రోల్ బాటిల్ తీసుకు వచ్చి.. సిలిండర్స్ పేలి ఇల్లు తగలబడిపోయినట్లు.. అందులో యువతి చిక్కుకుని చనిపోయినట్లు క్రియేట్ చేయాలనుకున్నాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఘటన స్థలంలో జరిగే ఘోరాన్ని ఆపగలిగారు. ఒక వేళ ఇల్లు కాలిపోయి ఉంటే చుట్టుపక్కల కూడా ఎన్నో ఇళ్లు తగలబడి ఉండేవని పోలీసులు అన్నారు. అయితే కృష్ణమోహన్ ఈ కుట్రను యూట్యూబ్లో చూసి అదే తరహాలో చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.