2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి హరీష్ రావు ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్ రావు తొలిసారి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఆసక్తి నెలకుంది. లంగాణ అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ అంటే సామాజిక విలువల స్వరూపమని ఆయన ప్రసంగించారు. భారత ఆర్థికవృద్ధిరేటు ఏడాది నుంచి తగ్గుతూ వస్తోందన్నారు.
రాష్ట్రాలకు వచ్చే గ్రాంట్లలో కోత పడిందన్నారు. సొంత ఆదాయాలపై పూర్తి ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ను ప్రతిపాదిస్తోంది. ప్రాధాన్య పథకాలు, ఎన్నికల హామీలు, అభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత బడ్జెట్ కంటే 15-16 శాతం పెంచి తీసుకురావాలని నిర్ణయించింది.
2020-21 బడ్జెట్ అంచనాలు :
2020-21 ఆర్థిక సంవత్సరం రూ.1,82,914.42 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.22,482.12కోట్లు కాగా. ఆర్థిక లోటు రూ. 33,191.25కోట్లు ఉంటుందని అంచనా.
బడ్జెట్ ముఖ్యంశాలు :
మైనారిటీ సంక్షేమానికి రూ. 1518.06కోట్లు
ఎస్సీ ప్రత్యేక నిధికి రూ. 16534.97 కోట్లు
ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 9771.27 కోట్లు
రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు
చిన్న నీటిపారుదలశాఖకు రూ.600 కోట్లు
రైతు వేదిక నిర్మాణానికి రూ.300 కోట్లు
సాగునీటి రంగానికి రూ.11,054 కోట్లు
ఎంబీసీల సంక్షేమానికి రూ.500 కోట్లు
అన్ని రకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు
మత్స్యకారుల సంక్షేమానికి రూ.1586 కోట్లు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం రూ. 350 కోట్లు
మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం రూ.10 వేల కోట్లు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభివృద్ధికి రూ.480 కోట్లు
మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1200 కోట్లు
పంచాయతీరాజ్ అభివృద్ధికి రూ. 23,500 కోట్లు
మున్సిపల్శాఖకు రూ. 14,809 కోట్లు
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.2,650 కోట్లు
పాఠశాల విద్య కోసం రూ. 10,421 కోట్లు
ఉన్నత విద్య కోసం రూ.1,723 కోట్లు
వైద్యరంగానికి రూ. 6,186 కోట్లు
ఆర్టీసీకి రూ.1000 కోట్లు
అన్ని రకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.15,18 కోట్లు
పారిశ్రామిక అభివృద్ధికి రూ.1,998 కోట్లు
గృహ నిర్మాణానికి రూ.11,917 కోట్లు
హరితహారం కోసం రూ. 791 కోట్లు
మార్కెట్ చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.338 కోట్ల పారిశ్రామిక రాయితీలు
విద్యుత్శాఖకు రూ.10,416 కోట్లు కేటాయింపు
వెనుకబడిన వర్గాల కోసం రూ. 4,356.82 కోట్లు
ఆర్అండ్బీ కోసం రూ. 3,494 కోట్లు
పోలీస్శాఖకు రూ.5,852 కోట్లు
మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్కు రూ.1000 కోట్లు
పాడి రైతుల ప్రోత్సాహకం కోసం రూ.100 కోట్లు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం రూ.20 లక్షల ఆర్థికసాయం
ఎస్సీ, ఎస్టీ గృహావసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు, మైక్రో ఇరిగేషన్ కోసం సబ్సిడీ రెట్టింపుః
విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు
రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు
అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయింపు
దేవాలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు
రూ.600 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం
పంచాయతీల్లో 36 వేల పారిశుద్ధ్య కర్మచారుల వేతనం రూ.8,500 కి పెంపు
దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం రూ.50 కోట్లు
40 ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం
రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మనది
తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,896 యూనిట్లు
మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకంగా వీ-హబ్
టీఎస్ ఐపాస్తో 12,427 పరిశ్రమలకు అనుమతి
శీతల పానీయంగా నీరా అమ్మకం
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయిస్ బోర్డు
సొంత స్థలం కలిగిన పేదలు ఇల్లు నిర్మించుకోడానికి ఆర్థికసాయం
గీత కార్మికుల చెట్టు పన్ను, పాత బాకీల రద్దు
వివిధ దశల్లో 2 లక్షల 72 వేల 763 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం
వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 71 మైనార్టీ జూనియర్ కాలేజీలు
ఇప్పటి వరకు 76 లక్షల 92 వేల 678 గొర్రెల పంపిణీ
మరో 70 లక్షల 88 వేల గొర్రె పిల్లల ఉత్పత్తి
ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 6లక్షల పరిహారం
హరితహారంలో భాగంగా ఈత, తాటి వనాల పెంపకం
టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రూ.2 లక్షల 4 వేల కోట్ల పెట్టుబడులు
టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి
టీఎస్ ప్రైమ్ పేరుతో మైనార్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం
దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్రతిపాదనలు
సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ.100 కోట్లు
పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి రూ. 550 కోట్లు
ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు
ఆర్టీసీలో కార్గో, పార్సిల్ సర్వీసును ప్రారంభించాం
లక్షా 9 వేల కోట్లకు ఐటీ ఎగుమతులు పెరిగాయి
గీత కార్మికుల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక పాలసీ