ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. అయితే ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్నాయి .ప్రపంచం మొత్తం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తూ ప్రపంచ మహమ్మారిని తరిమి కొట్టేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తమ రక్షణ కార్యకలాపాల విషయంలో ఆయా దేశాలు తన పని తాను చేసుకుంటూ పోతుంది. రష్యాకు చెందినటువంటి ఎమ్22 సిర్కాన్ యాంటీ షిప్ హైపర్ సోనిక్ షిప్ ని 2022 నాటికి వాడుకలోకి తీసుకురావడానికి నిర్ణయించారు ... అయితే దీనికి సంబంధించి నటువంటి అన్ని క్వాలిటీ పరీక్షలు గత పది రోజుల క్రితం ప్రారంభించి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి మూడు పరీక్షలు పూర్తవక వచ్చే నెల నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం 2020-21 మధ్యలో 7 టెస్ట్ లు నిర్వహించి 2022లో వాడుకలోకి తెచ్చే ముందు మరో మూడు పరీక్షలు నిర్వహించాలని అక్కడి అధికారులు భావిస్తున్నారట. రష్యా మాజీ డిప్యూటీ డిఫెన్స్ మంత్రి లాద్ వీర్ పూ వన్ కిన్ 2011 లో ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఇది. వాడితో పాటుగా జలాంతర్గామి ప్రయోగించేటువంటి హైపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థ ఇందులో ఉంది. దీన్ని అభివృద్ధి ప్రణాళిక 2015 నాటికి అధికారికంగా ప్రారంభం కాగా ప్రస్తుతం చివరి దశకు వచ్చింది.
ఒకవేళ ఇది పూర్తయితే భారత దేశంతో కలిసి రష్యా కుదుర్చుకుంటున్నటువంటి బ్రహ్మస్ క్షిపణి షిప్ ని దీని ప్రయోజనం నెరవేరుతుంది . భారత సైన్యం తో పాటుగా భారత వైమానిక దళం భారత నావికా దళం.. ఇప్పటికే తమ ఆర్సినెల్లో దాదాపు మాక్ 2.83 అంటే సుమారు 3424 కిలోమీటర్ల వేగంతో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పిన్ పాయింట్ లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి.. ఆయుధాలను తయారు చేయడానికి సిద్ధపడుతున్న వేళ.. ఇది త్వరగా పూర్తయ్యే టువంటి అవకాశం ఉంది అనే పాయింట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా లెక్కలోకి వస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.