ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని ఓ జంట నిరూపించింది..అలాగే ప్రేమలో ఓడితే వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలను కూడా కోల్పోయారు.. ప్రేమ గుడ్డిది అని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు.. కానీ తెలివి తక్కువ పని చేస్తుందని కూడా నిరూపించింది..అసలు విషయానికొస్తే...ఆలస్యంగా ఓ నమ్మలేని ఘటన వెలుగులోకి వచ్చింది.. 

 

 

 

 

 

 

వివరాల్లోకి వెళితే...ఈ ఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావు పల్లికి చెందిన బాలిక(16), కల్వకోలు గ్రామానికి చెందిన సాయికృష్ణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆమెను వెంట తిప్పుకున్నాడు. అయితే 20 రోజుల క్రితం సాయికృష్ణకు వేరే అమ్మాయితో పెద్దలు ఎంగేజ్‌మెంట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తనను మోసం చేయొద్దని ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. 

 

 

 

 

 

అంతేకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.. దాంతో ఆమె చివరి సారి లైంగికంగా కలవాలన్న కోరిక కలిగింది.. అతన్ని అడిగింది.. దానికి అంగీకరించిన అతను..వీపనగండ్ల మండలం గోవర్ధనగిరికి మామిడి కోతకు ఆమెను తీసుకొచ్చాడు. బాలిక మరోసారి పెళ్లి ప్రస్తావన తేవడంతో కుదరదని చెప్పేశాడు. మనస్తాపానికి గురైన బాలిక వెంట తెచ్చుకున్న కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగేసింది. దీంతో కంగారుపడిన సాయికృష్ణ ఆమెకు ఉప్పునీరు తాగించి కక్కించాడు. 

 

 

 

 

ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో మరొకరి సాయంతో వెంటనే పెబ్బేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో అతడు షాకయ్యాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం బాలిక మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు.బాలిక ఆత్మహత్య చేసుకునే ముందు సాయికృష్ణ ఆమెతో లైంగికంగా కలిసినట్లు వెల్లడైంది. దీంతో బాలిక ఆత్మహత్య చేసుకుందా? లేక తనకు అడ్డొస్తుందన్న అక్కసుతో సాయికృష్ణే ఆమెను చంపేశాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు మైనర్ కావడంతో నిర్భయ కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనపర్తి సీఐ సూర్య నాయక్ తెలిపారు.నిందితుడిని పట్టుకొనే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: