వివరాల్లోకి వెళితే..ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో ఇటీవలే చేసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరకు చెందిన కర్నాటి ప్రవీణ్ రెడ్డి.. ఏపీలోని తూర్పు దిగవల్లికి చెందిన నాగిరెడ్డితో ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్నాడు. మీది, మాది ఒకే కులమంటూ మాటా మంతీ కలిపాడు. ఇలా పరిచయం ఇంట్లో వరకు వెళ్ళింది. వాళ్ళు కూడా ఆ అబ్బాయితో చనువుగా మాట్లాడుతున్నారు. అలా రెండు , మూడు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఇంట్లో మనిషి లాగా దగ్గరయ్యాడు.
ఓ రోజు తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. నాగిరెడ్డి తన భార్యతో కలిసి మామ గారింటికి వెళ్లాడని తెలుసుకున్నాడు. ఎప్పటిలాగే ఇంటికి వచ్చి ఆ ఇంట్లో వృద్ధులైన కుటుంబ సభ్యులను ఏమార్చి బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. మామ గారింటికి వెళ్లొచ్చిన తర్వాత చోరీ జరిగిందని తెలుసుకొని నాగిరెడ్డి , అతని సతీమణి లబో దిబో మన్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, సీఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. చొరీకి గురైన నగల విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని వెల్లడించారు.ఇలాంటి సంఘటనలను చూసైనా ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు..