వరదల్లో చిక్కుకుపోయిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కిట్లను అందించేందుకు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది . భారీ వర్షాల కారణంగా వరదలు ఎక్కువగా వచ్చి జనావాసాల్లోకి నీరు వచ్చి ప్రస్తుతం మురికి నీరు నిండి పోయి కనీసం తినడానికి తిండి లేక పడుకోవడానికి నిద్రలేక ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ప్రజానీకాన్ని ఆదుకోవడానికి అటు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వరద బాధితులు ఇంటివద్దకే సీఎం రిలీఫ్ కిట్ లను అందించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.
సీఎం రిలీఫ్ ఫండ్ కిట్లను వరద బాధితుల కుటుంబాల ఇళ్ల వద్దకు అందచేయాలి స్పష్టం చేశారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. రెండు వేల ఎనిమిది వందల రూపాయల విలువైన ఈ సీఎం రిలీఫ్ ఇట్లు ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు మూడు బ్లాంకెట్ లు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ పప్పు, అరకేజీ వంటనూనె, కారంపొడి - 200 gm,పసుపు - 100 gm, ఉప్పు - 1kg, చింతపండు - 250 gm, గోధుమ పిండి - 1kg, చాయ్ పత్తి - 100 gm, చక్కెర - 500 gm పాటు వరద బాధితులకు దుప్పటి కూడా అందిస్తున్నారు.