ఇక ట్రంప్ కి బలమైన ప్రత్యర్ధిగా అవతరించి హడలెత్తిస్తున్న జో బైడెన్ ట్రంప్ తాజా వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. భారత్ ని మురికిదేశం అని అనడం చాలా తప్పు అంటూ ఆయన ఖండించారు. భారర్ అమెరికా రెండూ సహజ మిత్రులని కూడా బైడెన్ అన్నారు. ఎవరైనా మిత్రులను అలా దూషిస్తారా అంటూ ఆయన ట్రంప్ వ్యవహార శైలిని తూర్పారా పట్టారు. భారత్ తో అమెరికా సంబంధాలు ఎప్పటి మాదిరిగానే తాము కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
తనతో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలుగా పోటీ చేస్తున్న కమలా హరీస్ కూడా భారత్ కి కొండంత అండగా ఉంటామని బైడెన్ ప్రకటించడం నిజంగా మంచి పరిణామం. ఇప్పటికే ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బైడెన్ కి మద్దతు బాగా ఉంది. తాజాగా దానిని ఆయన మరింతగా పెంచుకున్నారు. ఇక సర్వేలు అన్నీ కూడా బైడెన్ గెలుపు ఖాయమని కూడా చెబుతున్నాయి. మొత్తానికి ట్రంప్ పట్ల ఆ మాత్రం ఈ మాత్రం ప్రేమ అభిమానాలు ఉన్న వారు సైతం ఈసారి ఆయన రావడం కష్టమేనని అనేస్తున్నారు అంటే అదంతా ట్రంప్ చేసుకున్నదేనని చెబుతున్నారు.