ముఖ్యంగా చైనాతో వివాదం నేపథ్యంలో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనా విషయంలో భారత దౌత్య పరంగా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు చైనాతో మిత్రదేశాలు గా ఉన్న దేశాలను కూడా తమ వైపు తిప్పుకుని అంతకంతకు పెంచుకుంటూ వస్తుంది భారత్. ప్రస్తుతం దాదాపుగా అన్ని దేశాలతో కూడా సంబంధాలను మరింత మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతుంది అనే విషయం తెలిసిందే.
చైనా చేస్తున్నటువంటి దారుణాలను తట్టుకోలేకపోతున్నా ప్రపంచ దేశాలు ప్రస్తుతం భారత్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నాయి అనే విషయం తెలిసిందే. ఇండియన్ ఓషన్ లో చైనాకు చెక్ పెట్టేందుకు భారతదేశం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచ ఉన్మాద దేశం అయినటువంటి చైనా నుంచి ప్రమాదం ఉంది అని భావించగా.. మారి టు టైమ్స్ సర్వే లైన్స్ ర్యాడర్స్ ఇకపైన మాల్దీవులు బంగ్లాదేశ్ మయన్మార్ లకు కూడా ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఇలా చైనా విషయంలో ఆయా దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నాయి. ఇలా క్రమక్రమంగా చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రస్తుతం చైనాకు వరుసగా షాకులు తగులుతున్నాయి.