
వాణిజ్య నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా చిన్న చిన్న సంస్థలను నయానో భయానో అణచివేస్తున్నదని అమెరికలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తో పాటు 48 రాష్ట్రాలు ఫేస్ బుక్ పై న్యాయస్థానాల్లో దావాలు వేశాయి. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తో పాటు 48 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ దావా వేయడంతో ఫేస్ బుక్ పరిస్థితి గందరగోళంలోకి నెట్టబడింది. కేసు తీవ్రత అధికంగా ఉన్నందును మున్ముందు ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ లను విక్రయించుకోవాల్సిన దుస్థితి ఉంటుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రపంచంలో తన ఏకఛత్రాధిపత్యానికి ఎదురు లేకుండా ఉండేందుకు ఫేస్ బుక్ దిగ్గజం ఒక వ్యవస్థీకృత వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నది. పలువురు న్యాయ నిపుణులు, టెకీ కంపెనీలు సైతం ఆరోపిస్తున్నాయి కూడా. మొగ్గ తొడుగుతున్న చిన్న చిన్న కంపెనీలను చిదిమేయడం లేకా దారిలోకి తెచ్చుకోవడం చేస్తున్నది. పెద్ద ఎత్తున డబ్బులు ఎరవేసి స్వాధీనపర్చుకొంటున్నదంటూ పలువురు గగ్గోలు పెడుతున్నా పెద్దగా స్పందన రాలేదు. అయితే ఇటీవలి కాలంలో ఫేస్ బుక్ అనైతిక కార్యకలాపాలపై అమెరికా ప్రభుత్వాలు దృష్టి సారించాయి
అమెరికా ప్రభుత్వ ఆరోపణలను ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ జెన్నిఫర్ న్యూస్టెడ్ తోసిపుచ్చారు. అమెరికా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. అమెరికా వ్యాప్తంగా కంపెనీపై దావాలు వేయడంతో స్టాక్ ఎక్చేంజీల్లో షేర్లు పతనమయ్యాయి