తిరుచ్చి నుంచి ఇతర జిల్లాలకు టీకాలను తరలిస్తున్న ప్రత్యేక వాహనాలను మంత్రి విజయ భాస్కర్ ప్రారంభించారు. పచ్చజెండా ఊపి వీటిని ఆరంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కరోనా టీకా రాష్ట్రంలోని పది మండలాలకు తరలించి, అక్కడి నుంచి జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తామని చెప్పారు. ఈ నెల 16వ తేదీ టీకాలు వేసే కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీకా విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, అవన్నీ నిరాధారమైన పుకార్లని ఆయన తెలిపారు. ఇలా వదంతులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు.
తిరుచ్చి నుంచి ఇతర జిల్లాలకు టీకాలను తరలిస్తున్న ప్రత్యేక వాహనాలను మంత్రి విజయ భాస్కర్ ప్రారంభించారు. పచ్చజెండా ఊపి వీటిని ఆరంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కరోనా టీకా రాష్ట్రంలోని పది మండలాలకు తరలించి, అక్కడి నుంచి జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తామని చెప్పారు. ఈ నెల 16వ తేదీ టీకాలు వేసే కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీకా విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, అవన్నీ నిరాధారమైన పుకార్లని ఆయన తెలిపారు. ఇలా వదంతులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు.