ప్ర‌ముఖ హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబుగోగినేని రాజ‌కీయ‌, సామాజిక అంశాల్లో త‌న‌దైన స్టైల్ లో స్పందిస్తుంటాడు. తాజాగా గోగినేని ప్ర‌స్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఆనంద‌య్య మందుపై సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశాడు. "అది మందు కాదు చ‌ట్నీ అంటూ త‌న పోస్ట్ లో పేర్కొన్నారు. గోగినేని పోస్ట్ లో....స‌స్తారురొరేయ్ మళ్లీ చెపుతున్నాను. మళ్లీ చెప్తున్నాను. మళ్లీ మళ్లీ చెప్తాను. మీకు ఇష్టం లేకపోయినా చెప్తాను. మీ ఉన్మాదానికి దడిసేది లేదు. చంపుతాము అన్న బెదిరింపులే నాకు కొత్త కాదు, మీరు చంపడం మొదలు పెట్టినాకే నేను ఇండియా కు తిరిగి వచ్చాను, మీ బూతులు, మీ ఏడుపులు ఒక లెక్కా. జ్ఞానం అజ్ఞానానికి లోంగదు. వైరస్ మీ ఉన్మాదానికి తలవంచదు. మీ నమ్మకానికి పర్యవసానాలు ఉంటాయి. అనందయ్యను నమ్మి మాస్క్ తీసేసిన వాడికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది. 100 లో 4 మాత్రమే కావచ్చు. కానీ ఆ నలుగురికి ఉన్నది ఆ ఒక్క ప్రాణమే.

ఇది భారత దేశానికీ, పాశ్చాత్య దేశాలకు మధ్య యుద్ధం కాదు. ఇది అలోప‌తి కీ ఇతరులకూ పోటీ కాదు. ఇది మనమందరం ఒక వైపూ, వైరస్ ఇంకొక వైపూ ఉండాల్సిన యుద్ధం. యుద్ధం అయ్యాక మోసం చేస్తున్న హాస్పిటల్స్ పని పట్టండి. ఇప్పుడు మాత్రం ప్రాణమే ముఖ్యం అని మర్చిపోవాకండి. డాక్టర్ మీద దాడి ఆపండి. వారు లేకపోతే మనలో చాలా మంది ఉండరు. చాలా మంది తప్పులు చేస్తుండవచ్చు - వైద్యం ప్రైవేట్ రంగానికి అప్పచెప్పినప్పుడు ఇలాగే ఉంటుంది. కృష్ణపట్నం లో కేసులు లేవు అన్న అబద్ధం నుండి పుట్టుకొచ్చిన ఉన్మాదం ఇది. తను చేసిన వంటకాన్ని మందు అని ఆనందయ్య అనడం వల్ల వచ్చిన అభిప్రాయం ఇది.

నాకు బాగైంది అని కొంతమంది సాక్ష్యం చెప్పడం వల్ల ఏర్పడిన ప్రేయర్ ఆయిల్ విశ్వాసం ఇది. వైరస్ సోకిన తరువాత 14 రోజులకు సాధారణంగా నెగటివ్ వస్తుంది. ఎందుకంటే వైరస్ జీవిత కాలం అది. జలుబు లాగానే.  12 వ రోజు నెల్లూరు కి వచ్చి చట్నీ తిని రెండు రోజుల్లో నెగటివ్ అంటే అది దేనికీ రుజువు కాదు. యుర్వేదం తనకు కరోనా లాంటి వైరస్ ను కట్టడి చేసే శక్తి ఉన్నదని ఎక్కడా నిరూపించలేదు. మూలికా వైద్యం కూడా కరోనా పై తన ప్రతాపం నిరూపించలేదు. ఆనందయ్య చేస్తున్నది ఆయుర్వేదము కాదు. ఆ విషయం ఆయుష్ కూడా చెప్పింది. నేను మతస్తులకు వ్యతిరేకం కాదు. ఉన్మాదులకు మాత్రమే." అంటూ సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు.



' data-card-branding='0' class='embedly-card'>">


మరింత సమాచారం తెలుసుకోండి: