కర్ణాటక రాష్ట్రములో వివిధ రాజకీయ కారణాల వలన మాజీ సీఎం యడ్డ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తదుపరి కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఎన్నో రాజకీయ ఉత్కంట పరిస్థితుల మధ్య కర్ణాటక మాజీ సీఎం కుమారుడు బసవరాజు బొమ్మైనే సీఎంగా అధిష్టానం ఎంపిక చేసింది. ఈ ఎంపిక విషయంలో మాజీ సీఎం యడ్డ్యూరప్ప చేయి కూడా ఉందనేది పైమాట. ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి నేతృత్వంలో నూతన కేబినెట్ ను ఏర్పరిచారు. బొమ్మై కేబినెట్ లో 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రెండు మూడు రోజుల నుండి ప్రచలంలో ఉన్న విధంగానే ఒక్క పదవిని మాత్రం ఏ ఒక్కరికీ కేటాయించలేదు. అదేమిటంటే సీఎం స్థానం తర్వాత ముఖ్యమైన డిప్యూటీ సీఎం పదవి. ఇది సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పవచ్చు.

అంతే కాకుండా ఈ కేబినెట్ కూర్పులో బీజేపీ అధిష్టానం సలహా మేరకే చేసినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే డిప్యూటీ సీఎం ను ఎవ్వరికీ ఇవ్వకపివడానికి గల కారణాలను పరిశీలిస్తే, కర్ణాటక బీజేపీలో ఈ పదవిపై ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ పదవి కోసం వారం ముందు నుండే కేంద్రంలో తిష్ట వేసి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ అంశాలన్నింటినీ తీక్షణంగా ఆలోచించిన బీజేపీ అధిష్టానం ఈ పదవిని ఎవరికీ కేటాయించకపోవడమే సబబని నిర్ణయించుకుంది. అందుకే ఈ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏ ఒక్కరికయినా ఈ పదవి ఇస్తే, పార్టీలో బేదాభిప్రాయాలు వస్తాయనే ముందు చూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.

కేబినెట్ ఎంపికలో అన్ని కులాలవారికి ప్రాధాన్యం కల్పించడం కొసమెరుపు. అత్యధికంగా ఎప్పటిలాగే లింగాయత్ సామజిక వర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులిచ్చారు. ఇందులో యడ్డ్యూరప్ప కీలకంగా వ్యవహరించారని సమాచారం. మొత్తం 34 మంత్రులను కేటాయించే అవకాశం ఉన్నా కూడా 29 మందినే మంత్రులుగా ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. మరి కొత్త ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన బసవరాజ్ బొమ్మై ఏ విధంగా తన పాలనను కొనసాగిస్తారో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: