అంతే కాకుండా ఈ కేబినెట్ కూర్పులో బీజేపీ అధిష్టానం సలహా మేరకే చేసినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే డిప్యూటీ సీఎం ను ఎవ్వరికీ ఇవ్వకపివడానికి గల కారణాలను పరిశీలిస్తే, కర్ణాటక బీజేపీలో ఈ పదవిపై ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ పదవి కోసం వారం ముందు నుండే కేంద్రంలో తిష్ట వేసి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ అంశాలన్నింటినీ తీక్షణంగా ఆలోచించిన బీజేపీ అధిష్టానం ఈ పదవిని ఎవరికీ కేటాయించకపోవడమే సబబని నిర్ణయించుకుంది. అందుకే ఈ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏ ఒక్కరికయినా ఈ పదవి ఇస్తే, పార్టీలో బేదాభిప్రాయాలు వస్తాయనే ముందు చూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఈ కేబినెట్ ఎంపికలో అన్ని కులాలవారికి ప్రాధాన్యం కల్పించడం కొసమెరుపు. అత్యధికంగా ఎప్పటిలాగే లింగాయత్ సామజిక వర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులిచ్చారు. ఇందులో యడ్డ్యూరప్ప కీలకంగా వ్యవహరించారని సమాచారం. మొత్తం 34 మంత్రులను కేటాయించే అవకాశం ఉన్నా కూడా 29 మందినే మంత్రులుగా ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. మరి కొత్త ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన బసవరాజ్ బొమ్మై ఏ విధంగా తన పాలనను కొనసాగిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి