అయితే కాపులు అందరూ పవన్ ను నమ్మేస్తారా ? నిజంగా అంత సీన్ ఉందా ? అంటే నిజంగా అంత సీన్ లేదనే చెప్పాలి. అసలు కాపులు ఎక్కువుగా నష్టపోయింది మెగా ఫ్యామిలీ వళ్లే అని ఆ కులం వారే చెప్పే మాట. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎంతో మంది కాపు ధనవంతులు , పారిశ్రామిక వేత్తలు , ఇతర పార్టీల్లో స్ట్రాంగ్ గా మంచి పదవుల్లో ఉన్న కాపు నేతలు.. చివరకు కాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ చిరును నమ్మేసి ఈ పార్టీలోకి వచ్చారు.
ఈ పార్టీలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆర్థికంగా కుదేలు అయిపోయారు. ఇక టిక్కెట్లు ఆశించి కోట్లు ఖర్చు పెట్టిన వారు పార్టీ టిక్కెట్లు చాలా మంది రాజకీయాలకు కూడా దూరమయ్యారు. ఇక గత ఎన్నికల్లోనూ చాలా మంది కాపు నేతలు జనసే న నుంచి పోటీ చేశారు. వీరు కూడా ఆర్థికంగానే గట్టిగానే ఖర్చు పెట్టారు. మళ్లీ వారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలలో పోటీ చేయాలి రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాన్ రాజకీయ నిలకడ లేమి తో కూడా చాలా మంది కాపులు నమ్మే పరిస్థితి లేదు.