పార్టీ మారిన నేతలదే ప్రస్తుతం హవా నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. అటు తెలుగుదేశం పార్టీలో అయినా... ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా సరే... పార్టీ మారితే చాలు... పదవి గ్యారంటీ. గతంలో టీడీపీలోకి మొత్తం 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. అందులో నలుగురు మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. ఇక నామినేటెడ్ పదవులు కూడా పెద్ద ఎత్తునే పొందారు వలస నేతలు. ఇప్పుడు వైసీపీలో కూడా సేమ్ సీన్ నడుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు వచ్చి గెలిచిన నేతలు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. అందులో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అమాత్యులుగా ఉన్నారు. ఇక ఎన్నికల అనంతరం జగన్ పరిపాలనకు జై కొట్టిన నేతల్లో ఇద్దరు శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వర ప్రసాద్లు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరిద్దరు కూడా పదవిపై గ్యారంటీతోనే పార్టీ మారినట్లు తెలుస్తోంది.
పార్టీ మారిన నేతలదే ప్రస్తుతం హవా నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. అటు తెలుగుదేశం పార్టీలో అయినా... ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా సరే... పార్టీ మారితే చాలు... పదవి గ్యారంటీ. గతంలో టీడీపీలోకి మొత్తం 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. అందులో నలుగురు మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. ఇక నామినేటెడ్ పదవులు కూడా పెద్ద ఎత్తునే పొందారు వలస నేతలు. ఇప్పుడు వైసీపీలో కూడా సేమ్ సీన్ నడుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు వచ్చి గెలిచిన నేతలు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. అందులో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అమాత్యులుగా ఉన్నారు. ఇక ఎన్నికల అనంతరం జగన్ పరిపాలనకు జై కొట్టిన నేతల్లో ఇద్దరు శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వర ప్రసాద్లు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరిద్దరు కూడా పదవిపై గ్యారంటీతోనే పార్టీ మారినట్లు తెలుస్తోంది.