ఇండియాలో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. వీటి సంఖ్య దాదాపు వెయ్యికి చేరువైంది. ఇండియాలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసిన కొన్ని రోజుల్లోనే ఈ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అందులోనూ ఇప్పుడు వెలుగు చూస్తున్న కేసులు కేవలం ఎయిర్‌ పోర్టుల్లో జరిపిన టెస్టుల్లో వెలుగు చూస్తున్నవే.. ఇంకా సమాజంలో పాకిపోతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎంత ఉంటుందో ఇప్పుడే చెప్పలేం..


అయితే.. ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ అరాచకం చేయబోతోందట. ఇండియాలో దేశంలో ఒమిక్రాన్‌ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్న సమయంలో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త దీనిపై చేసిన ఓ విశ్లేషణ హడలెత్తిస్తోంది. ప్రొఫెసర్‌ పాల్‌ కొట్టుమాన్‌ అనే ఈ శాస్త్రవేత్త ఏమంటున్నారంటే..  భారత్‌లో రోజుల వ్యవధిలోనే  కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందట. భారీ జనాభా ఉన్న భారత్‌లో ఈ అరాచకపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందట.


అంతే కాదు.. ఈ వారంలోనే కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఇండియాలో విజృంభించే అవకాశం లేకపోలేదని సదరు సైంటిస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. భారత్‌లో కరోనా వ్యాప్తిని అంచనా వేసే కొవిడ్‌ ట్రాకర్‌ను ఈ ప్రొఫెసర్‌ పాల్‌ కొట్టుమాన్‌ పరిశోధకులు బృందం తయారు చేసింది. ఈ బృందం ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టింది. ఇప్పటికే భారత్‌లోని ఆరు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఈ సైంటిస్టులు టీమ్ చెబుతోంది. 3


డిసెంబర్‌ 26 నాటికి వైరస్‌ ముప్పు ఉన్న రాష్ట్రాల సంఖ్య 11 చేరిందంటన్న ఈ బృందం.. కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతాయని అంచనా వేసింది. తాము రూపొందించిన కోవిడ్‌ ట్రాకర్‌ ద్వారా ఈ విషయాన్ని నిపుణులు అంచనా వేశారు. ఈ విషయంలో చాలా వరకూ వాస్తవం ఉండొచ్చు. ఇక ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏంటంటే.. ఈ ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రుల పాలయ్యే వారి సంఖ్య ఇప్పటి వరకూ అయితే తక్కువగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: