
మందలంలో ఉన్న పొలాలలో పైపులకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మోడీ సభకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో... వెంటనే అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. అటు అగ్నిమాపక సిబ్బంది కూడా... ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మూడు కిలోమీటర్ల దూరంలోనే భారీ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో... మోడీ సభ దగ్గర భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
ఇది ఇలా ఉండగా... కాసేపటి క్రితమే ఏపీకి వచ్చిన నరేంద్ర మోడీ... అమరావతి పైలాన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పైలాన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం A పైలాన్ ను రూపొందించారు. వేదిక మీదకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ స్థలంలో కేరింతలతో ప్రజలు స్వాగతం పలికారు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు సన్మానించడం జరిగింది. అనంతరం కలంకారి చిత్రాన్ని కూడా అందజేశారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు