
పహల్గాం ఉగ్ర దాడి కి ముందు హిందువు లు , ముస్లిం లు వేరంటూ సంచలన కామెంట్లు చేసిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ అహ్మద్ షా ఆ తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయారు . కనీసం మీడియా సమావేశాల్లో నూ ఆయన ఎక్కడా పాల్గొనలేదు .. ఇదే క్రమం లో ఆయన దేశం వదిలి పారిపోయారు అంటూ సోషల్ మీడియా లో కూడా వార్తలు వచ్చాయి . పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబం తో సహా దేశం విడిచి పారిపోయారని . భారత్ దాడికి భయపడి పాకిస్తాన్ లోని బంకర్ లో తల దాచుకున్నారంటూ విమర్శలు కూడా వచ్చాయి .
అయితే భారత్ , పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పు లు విరమణ తర్వాత మళ్లీ ఆసిమ్ మునీర్ ఎట్టకేల కు బయట కు వచ్చారు .. ఆపరేషన్ సింధూరు లో గాయపడి న పాకిస్తాన్ ఆర్మీ సైనికుల ను ఆసిమ్ మునీర్ కలుస్తున్నారు .. ఎల్ ఓ సి వద్ద 50 + సైనికులు , వైమానిక దాడుల్లో 35 నుంచి 40 మంది సైనికులు చనిపోయినట్లు గా తెలుస్తుంది .. అయితే ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన పాకిస్తాన్ ఆర్మీ సైనికుల ను పాక్ ఇంత వరకు బయట పెట్టలేదు . . కానీ పాకిస్తాన్ ఈ వాస్తవాన్ని పదే పదే దాచిపెడుతోంది .