దేశంలో ఏ వాహన ప్రమాదం జరిగినా ఆ ప్రమాదం మిగిల్చే నష్టాలూ అన్నీఇన్నీ కావు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఏఐ 171 విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఐదేళ్ళలో జరిగిన ప్రమాదాలలో ఇదే అతిపెద్ద ప్రమాదం అని తెలుస్తోంది.

గతంలో కూడా మన దేశంలో భారీ విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.  2020 కరోనా సమయంలో  బోయింగ్ 737 - 800 విమానం  దుబాయ్ నుంచి కేరళకు బయలుదేరగా  భారీ వర్షం వల్ల  విమానం లోయలో పది రెండుగా చీలిపోయింది.  ఆ సమయంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా  100 మంది గాయాలపాలయ్యారు.  2010 మేలో  మంగళూరులో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం  ఐఎక్స్  812 కుప్పకూలగా  ఈ ప్రమాదంలో 158 మంది మృతి చెందారు.

1998 జులైలో  అలయన్స్ ఎయిర్ ఫ్లయిట్ బోయింగ్ 737 2A8 ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పగా ఈ ప్రమాదంలో  55 మంది ప్రయాణికులు, ఐదుగురు స్థానికులు మరణించారు.  1996లో హర్యానాలో  రెండు ఎయిర్ లైన్స్ విమానాలు ఢీ కొనగా  ఈ ఘటనలో 340 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందారు.  1993 ఏప్రిల్ లో  ఇండియన్ ఎయిర్ లైన్ కు చెందిన విమానం  టేకాఫ్ సమయంలో  ప్రమాదానికి  గురి కాగా  ఈ ఘటనలో  118 మంది ప్రయాణికులు  55 మంది సిబ్బంది మృతి చెందారు.

 బెంగళూరు విమానాశ్రయంలో  ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం 605  కుప్పకూలింది.  రన్ వేను తాకడం వాళ్ళ ఈ ప్రమాదం సంభవించింది. 1990 సంవత్సరం ఫిబ్రవరి నెలలో  ఈ ఘటన చోటు చేసుకుంది.  ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో  146 మంది ప్రయాణికులతో  పాటు 92 మంది సిబ్బంది చనిపోయారు.  ఈ ప్రమాద ఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  మరోసారి వైరల్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: