అయితే నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారనే విధంగా భక్తులు తెలియజేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న రెయిలింగ్ విరిగి భక్తుల మీద పడడంతో ఒక్కసారిగా ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో తొక్కిసలాటకు దారితీసిందట. అయితే దేవాలయ సామర్థ్యం కేవలం 2 నుంచి 3 వేల వరకు ఉండగా ఈరోజు ఏకంగా 25 వేల మందిపైగా భక్తులు తరలి రావడంతో ఈ నష్టం జరిగినట్లుగా వినిపిస్తోంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భారీగానే భక్తులు విచ్చేశారు.
ప్రస్తుతం ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వెంటనే ఆలయ అధికారులు సైతం పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పరిస్థితిని నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పైన జిల్లా అధికారుల సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశాలను జారీ చేశారు. అలాగే ఆలయ భద్రత ఏర్పాట్లు కూడా నిర్లక్ష్యం ఉందా అనే విషయం పైన కూడా దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటన పైన ఆనం రామనారాయణరెడ్డి కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైన అటు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. మరి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తారేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి