రాబోతున్న 2019 ఎన్నికలలో అధికారమే ప్రధాన లక్ష్యంగా వైఎస్ జగన్ కొనసాగిస్తున్న ‘ప్రజా సంకల్ప యాత్ర’ ఈరోజు కాపు సామాజిక వర్గానికి అత్యంత కీలకమైన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేసిస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో జగన్ కొనసాగిస్తున్న పాద యాత్రలో జగన్ కు స్వాగతం ఇస్తూ కొందరు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలలో జహాన్ ఫోటోతో పాటు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ల ఫోటోలు కూడ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
2
ముఖ్యంగా రాబోతున్న ఎన్నికలల్లో ఆంధ్రప్రదేశ్ లో హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే జగన్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ సపోర్ట్ తీసుకోవచ్చు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం జగన్ పాద యాత్రలో హడావిడి చేస్తున్న ఈ ఫ్లక్సీలు రాబోతున్న కాలంలో జరగబోయే జగన్ పవన్ ల మైత్రికి సంకేతమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి జగన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజాయాత్ర ఫలితం వల్ల ఏ పార్టీ ఓట్లకు గండి పడుతుంది అని సస్పెన్స్ కొనసాగుతున్న నేపధ్యంలో జగన్ ఫ్లక్సీల పై కొన్ని చోట్ల పవన్ బాలయ్యల ఫోటోలు కనిపించడం హాట్ న్యూస్ గా మారింది.
అయితే ఈ ఫ్లేక్సీలను ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా బాలకృష్ణను అభిమానించే అభిమానులు మాత్రమే అంటూ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సద్దిచెపుతూ ఉన్నా ఈ ఫ్లేక్సీలు రాబోతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతం అంటూ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈరోజు గోదావరి పై ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుండి జగన్ పాదయాత్ర రాజమండ్రిలోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో తూర్పు గోదావరి జిల్లాలలోని జగన్ అభిమానులు సుమారు లక్ష మందితో జగన్ కు ఆహ్వానం పలకడానికి భారీ ఏర్పాటు జరుగుతున్నాయి.
జగన్ ఈమధ్యనే జరిగిన బిసిల ఆత్మీయ సమ్మేళనంలో బిసి లకు మరిన్ని వరాలు ప్రకటించిన నేపధ్యంలో బిసి కులాలు ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలో జగన్ తన మాటల వేడిని పెంచి మరిన్ని వాగ్దానాలు చేసే ఆస్కారం ఉంది. ప్రస్తుతం జగన్ తన ‘ప్రజా సంకల్ప యాత్ర’ లో చేస్తున్న వాగ్దానాలకు ఎన్ని లక్షల కోట్లు కావాలో అంచనాలు లేకపోయినా జగన్ చేస్తున్న వాగ్దానాలు మాత్రం రాజకీయ పార్టీలలో కలవరం లేపుతున్నాయి..