తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగుర వేసింది. అనుకున్న దానికన్నా ఎక్కువ అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుంది. ఆ తర్వతా కూడ కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు టీఆర్ఎస్ లోకి వలస వచ్చారు. గత నెల 11 న 17 లోక్ సభ స్థానాలకు పోటీ జరిగిన విషయం తెలిసిందే. నేడు తెలంగాణలో లోక్ సభ స్థానల ఫలితాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెదక్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 3,05,691 ఓట్ల భారీ మెజార్టీలో ఆయన గెలుపొందారు. కరీంనగర్...17..వరౌండ్.. బీజీపీ...77978 లీడ్. జహీరాబాద్ పార్లమెంటు నియోజవర్గంలో ఇప్పటి వరకు తెరాస 355310, కాంగ్రెస్ 343480, తెరాస ఆధిక్యం 11830 లో ఉన్నారు.