సీతను అపహరించిన రావణుడు లంకా నగరంలో వందలాది మంది రాక్షస స్త్రీల మధ్య అశోకవనంలో బంధించాడు అని అందరికి తెలిసిందే కదా. వీళ్లంతా సీతమ్మను నిరంతరం వేధించేవారు. అలాంటి స్థితిలో ఉన్న ఆమెను చూడటానికి వెళ్లిన హనుమంతుడిని సీత మొదట ఒక ప్రశ్న వేసింది. ఓ కాకి నన్ను పొడిచిందని గడ్డి పోచను తీసి అస్త్రంగా మార్చి దానిపైకి వదిలిన రాముడు, తనను పదినెలలుగా రావణుడు బంధించి హింసిస్తుంటే ఎందుకు ఇలా వదిలేశాడు. రాముడు చేతకానివాడు కాదు.. రామ లక్ష్మణులు ఇద్దరూ సమర్థులే. ఎదురుగా ఉండాల్సిన అవసరంలేదు వారు తలచుకుంటే ఒక్క దెబ్బకు రావణుడిని సంహరించగలరు. మరి ఎందుకిలా నన్ను ఏడిపిస్తున్నారని హనుమంతుని వద్ద రామలక్ష్మణులను దూషించింది సీత అమ్మవారు.


రామలక్ష్మణుల చేతకానితనమా లేక వారి అశ్రద్దతోనే సీతను రావణుడు అపహరించాడా మరి ఆమె దు:ఖానికి కారణం ఎవరు??. అయితే మొదట సీత ఈ విషయాన్ని అంగీకరించలేదు. కానీ తర్వాత తన తప్పును  తెలుసుకొని ఒప్పుకుంది. ‘మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి నసంశయః’ ఇది రామలక్ష్మణుల తప్పు కాదు, నేను చేసుకున్నదే అని అంగీకరించింది. మొదట బంగారు లేడిని చూసినప్పుడు ఇదేదో మాయలేడిలా ఉందని లక్ష్మణుడు అన్నాడు. ఇది తప్పనిసరిగా మారీచుని మాయ అయి ఉంటుందకి అని రాముడు కూడా హితవు పలికాడు. 


కానీ ఈ మాటలను సీత వినలేదు. కాగా ఒకవేళ రాక్షసుడైతే సంహరించు, ప్రాణాలతో దొరికినా, లేకపోయినా దాని చర్మాన్ని అయోధ్యకు మన వనవాస జ్ఞాపికగా తీసుకుపోదాం అని చెప్పింది. రాముడు ఎంతచెప్పినా బలవంతంగా పంపింది సీతమ్మ. రాముడు లేడిని చంపగానే హే లక్ష్మణా, హే సీతా అంటూ  అరిచాడు. ఆ మాటలు విన్న సీత, అవి రాముడి మాటలేనని, ఆయన ఆపదలో ఉన్నారని లక్ష్మణుని వెళ్ళమని చెప్పింది. ఆయన వెళ్లనంటే... రాముడు లేనిది చూసి నన్ను పొందాలని అనుకుంటున్నావా అని మాట్లాడేసరికి లక్ష్మణుడు తట్టుకోలేకపోయాడు. 


అక్కడ నుంచి లక్ష్మణుడు వెళ్లిపోగానే రావణాసురుడు వచ్చి ఆమెను సంహరించాడు. భిక్షకుడిగా వచ్చిన వచ్చిన రావణుడు సీత అందాన్ని పొగిడి, వివరాలు అడిగాడు. అన్ని విషయాలు చెప్పింది.. తెలియని వారికి మన గురించి చెప్పొచ్చా... అప్పుడైనా తప్పించుకోనే ప్రయత్నం చేయలేదు. అందుకే సీతకు ఏర్పడ్డ దు:ఖాలకు కారణం ఆమే. అయితే ఈ విషయం మొదట ఒప్పుకోకపోయినా, హనుమంతుని ముందు అంగీకరించింది. ఇది చేజేతులా నేను చేసుకున్నదేనని రామలక్ష్మణులతో చెప్పాలని సందేశం పంపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: