అలాకాకుండా ఎవరైతే సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారో,అలాంటివారు మంగళవారం పూట వెలిగించే ఈ దీపం వల్ల,వచ్చే ఆరు నెలల లోపు వారి సొంతింటి కల నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు.ఆ దీపం వెలిగించడంతో లక్ష్మీదేవి సర్వవిజ్ఞాలను తొలగిస్తుందట.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా అదేంటి కల నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారా.. ఆ దీపం ఎలా వెలిగించాలో,దాని కోసం ఏమేమి వస్తువులు కావాలో తెలుసుకుందాం పదండి..
దీని కోసం మంగళవారం పూట ఇంట్లో ముందుగా మంగళ గౌరీకి,లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజలు నిర్వహించాలి.ఈ దీపాన్ని యక్షిణి దీపమని అంటారు.ఈ యక్షిణి దీపం కోసం ఇంటికి పూజ గదిలో ఒక పీట వేసి,దానిపై ఎర్రటి క్లాత్ ను కప్పాలి.ఇప్పుడు రెండు ప్రమిదలను తీసుకొని బాగా శుభ్రం చేసి,పసుపు కుంకుమలను పెట్టాలి.ఆ తరువాత ఆ ప్రమిదలను ఒకదానిపై ఒకటి ఉంచి నువ్వుల నూనెను వేయాలి. ఇప్పుడు మూడు మూడు వత్తులను కలిపి ఒక వత్తిగా చెయాలి.ఇలాంటివి మూడు ఒత్తులు కావాలి. ఇప్పుడు వాటిని ప్రమిదల్లో ఉంచి వెలిగిస్తూ మంగళ గౌరీని లక్ష్మీదేవి పూజిస్తూ,సంకల్పం చెప్పుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా తొమ్మిది మంగళవారాల పాటు చేయడంతో లక్ష్మీదేవి కృప కలిగి,సొంతింటి కల నెరవేరుతుంది.మరియు సొంత ఇంటికి ఎలాంటి అడ్డంకులు ఉన్న,ఆర్థిక సమస్యలు ఉన్న వెంటనే తొలగిపోతాయి.
మరియు ఈ యక్షిణి దీపాన్ని ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నవారు కూడా వెలిగించుకోవచ్చు.