ఐపీఎల్ వచ్చిందంటే చాలు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  అప్పుడైతే ప్రేక్షకులందరూ స్టేడియం కి వెళ్లి ఐపీఎల్ మ్యాచ్ విషయం వీక్షించే వారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అలాంటి ఛాన్స్ లేకపోవడంతో ఇక టీవీల ముందు కూర్చొని మ్యాచ్ వీక్షించేందుకు ఇష్టపడుతున్నారు. అయితే బిసి అనుకున్న ప్రకారమే ఐపీఎల్ ప్రారంభించినప్పటికీ కరోనా వైరస్ కారణంగా ఇక తాత్కాలికంగా వాయిదా పడే పరిస్థితి వచ్చింది.  ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇక రెండవ దశను ఐపీఎల్  యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐని నిర్ణయించింది.



 ఇక మరికొన్ని రోజులు ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల క్రికెట్ బోర్డులు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్ ఆడేందుకు అనుమతించటం లేదు. దీంతో ఎన్నో జట్లకు ఊహించని షాక్ లు తగులుతున్నాయ్.  దీంతో ఐపీఎల్ జట్లలో ఎన్నో మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి.  ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫేస్ 2 లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ జట్టు లో కొన్ని మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.




 జట్టులో కొత్త ఆటగాడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు  ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం టిమ్ డేవిడ్ అనే సింగపూర్  ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ ఆటగాడు ఫైనల్ అలెన్  స్థానంలో టీమ్ డేవిడ్ ఆడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్కరు కూడా సింగపూర్ నుంచి ఆటగాళ్లు పాల్గొనలేదు.  కానీ మొదటిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో జట్టులో సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్  ఆడనున్నాడు. ఇతనికి 14 అంతర్జాతీయ టీ20 లు ఆడిన అనుభవం ఉంది. మరీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో రాణిస్తాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl