అయితే ఆటగాళ్ళు మరియు సిబ్బంది ఇంకా రూమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడే ఇవి ధృవీకరించబడ్డాయి కాబట్టి... పాకిస్తాన్ లోకి రాకముందు అందరూ నెగెటివ్ PCR లు మరియు కరాచీలో ఉన్నప్పటి నుండి రెండు నెగటివ్ PCR లు తిరిగి వచ్చినందున పర్యటన కొనసాగగలదని మేము విశ్వసిస్తున్నాము. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఏడాది ఇంగ్లండ్ మరియు న్యూజిలాండ్ షెడ్యూల్ చేసిన పర్యటనల నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ కారణంగా పాకిస్థాన్ బోర్డు కు వచ్చిన నష్ట తర్వాత అంతర్జాతీయ జట్టు యొక్క మొదటి పర్యటన లో భాగంగా సోమవారం నుండి పాకిస్తాన్ లో మూడు టీ 20 లు మరియు మూడు 50 ఓవర్ల మ్యాచ్ లను వెస్టిండీస్ జట్టు ఆడనుంది. టీ 20 ప్రపంచ కప్ సమయంలో అతను ఎదుర్కొన్న స్నాయువు గాయం నుండి కోలుకోలేకపోయిన తర్వాత, ఈ సిరీస్ లో వైట్ బాల్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ లేకుండానే జట్టు
పాక్ తో ఆడనుంది.