భారత క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..అత్యుత్తమ బ్యాట్స్ మెన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుని, విశ్వ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్ తో పాటు.. బిజినెస్ లపై కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఘూష్‌, క్లాత్, హాస్పిటాలిటీ రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. దీనిలో భాగంగా ఢిల్లీతో పాటు కోల్ కతా, పూనేలో రెస్టారెంట్స్ ను ఇప్పటికే నడిపిస్తున్నాడు. తాజాగా ముంబైలో కూడా తానుమ ఓ రెస్టారెంట్ ను ఏర్పాటుచేయనుండగా విరాట్ కోహ్లీ ఈ రెస్టారెంట్ ను సందర్శించాడు. తన జెర్సీ నెంబర్ 18 వచ్చేలా వన్8కమ్యూన్ పేరుతో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తున్నాడు.


 ముంబైలో ప్రారంభించబోయే రెస్టారెంట్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్ ఏర్పాటుచేస్తున్నారు. ముంబై లోని కిశోర్ కుమార్ కు చెందిన గౌరీ కుంజ్ పోర్షన్ ను కోహ్లీ దంపతులు ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్నారు. త్వరలోనే ఈ రెస్టారెంట్ ను ప్రారంభించనుండగా.. విరాట్ కోహ్లీ తాజాగా ముంబై లో ప్రారంభించబోయే రెస్టారెంట్ ను సందర్శించాడు. టాలిస్మానిక్ బ్యాటర్ ‘వన్8 కమ్యూన్’ పేరుతో రెస్టారెంట్లను ప్రముఖ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నాడు. తాజాగా ముంబై లోని లెజండరీ సింగర్ కిశోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో రెస్టారెంట్ ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నాడో కోహ్లీ వివరించాడు.

నిజానికి కిశోర్ దాస్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన పాడిన పాటలు వ్యక్తిగతంగా తన హృదయాన్ని తాకాయని, తనను ఎంతో ప్రభావితం చేశాయని మనీష్ పాల్ తో మాట్లాడుతూ చెప్పాడు. తన కాన్సెప్ట్ కు సరిగ్గా సరిపోతుందని, అందుకే ఈ బంగ్లాలో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: