ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావాస్కర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు క్లాస్ పీకాడు. బౌలింగ్ విభాగం బాగా రాణించినప్పటికీ బ్యాటింగ్ లో తేలిపోయామని.. మరో 40 పరుగులు చేసి ఉంటే బాగుండేదని ఓటమిపై సాకు చెప్పాడు రోహిత్.
ఇక ఇదే విషయంపై స్పందించిన గవాస్కర్ మాట్లాడుతూ.. మ్యాచ్ అక్కడ ముగిసి ఉంటుందని నేను నమ్ముతున్నాను. మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో 136 పరుగులకు 9 వికెట్లు తీశారు. హసన్ మీరాజ్ కు కూడా అదృష్టం వరించింది. అతని క్యాచ్ లు పడిపోయాయి. అయితే భారత్ ఇంకో 80 పరుగులు చేసి ఉంటే బాగుండేది. ఫలితం మరోలా ఉండేది. ఇక టీమిండియా ఓటమికి వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ క్యాచ్ వదిలేయడం కాదు రోహిత్ వ్యూహాలే కారణం అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. మీరు చెప్పింది కూడా నిజమే అంటూ అభిమానులు ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారు.