టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ చరిత్రలో రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు ధోని.  ఇక ధోని తర్వాత ఏ కెప్టెన్ కూడా ఇప్పటివరకు టీం ఇండియాకు వరల్డ్ కప్ అందించి ఇక జట్టును విశ్వవిజేతగా నిలపలేకపోయాడు అని చెప్పాలి. అయితే కేవలం గొప్ప కెప్టెన్ గా మాత్రమే కాదు బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ ఫినిషర్ గా కూడా అంతర్జాతీయ క్రికెట్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.



 అయితే ప్రజెంట్ భారత జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లతో పోస్ట్ చూస్తే అటు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకే ఎక్కువ క్రేజ్ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే క్రికెట్ లోకి అడుగుపెట్టే ఎంతోమంది యంగ్ క్రికెటర్లు ధోనిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ధోనితో ఒక్క మ్యాచ్ ఆడిన చాలు జీవితానికి అది సరిపోతుంది అని ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ఆశ పడుతూ ఉంటారు. అయితే అలాంటి ధోని గురించి ఇక అతని సహచరుడు గౌతమ్ గంభీర్ మాత్రం ఎప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇప్పటికే ఎన్నోసార్లు ధోని గురించి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన గౌతం గంభీర్ ఇటీవలే మరోసారి తన నోరు పారేసుకున్నాడు. 2007, 2011 వరల్డ్ కప్ లు ధోని సారధ్యంలో గెలిచింది టీమిండియా. అయితే భారత్ సమిష్టిగా రానించి వరల్డ్ కప్ గెలిస్తే కెప్టెన్ ధోనిని హీరోని చేశారని గౌతమ్ గంభీర్ విమర్శించాడు. icc ట్రోఫీలో గెలవడం మహేంద్ర సింగ్ ధోనీకే సాధ్యమని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై స్పందించిన గౌతమ్ గంభీర్.. ఐసీసీ టోర్నమెంట్లలో మనోళ్లు వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యమిస్తారు. వేరే జట్లు సమిష్టిగా ప్రదర్శన చేస్తాయి. 2007, 2011 ప్రపంచ కప్ లు భారత్ గెలిచిందంటే యువరాజ్ సింగ్ కారణం అంటూ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: