అయితే ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా ఆడబోతుంది టీం ఇండియా. అయితే ఈ మెగా టోర్నీ నేపథ్యంలో గాయం బారిన పడిన కీలక ప్లేయర్లు కోలుకొని మళ్ళీ జట్టులోకి రావాలని భారత జట్టు అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఫిట్నెస్ గురించి రోజుకో వార్త తెరమీదకి వస్తుంది. దీంతో అటు ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు అని చెప్పాలి. అయితే ఇక ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది అనేది తెలుస్తుంది.
భారత జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు అయినా శ్రేయస్, కేఎల్ రాహుల్ లు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలే పుష్కలంగా కనబడుతున్నాయట అయితే గాయాల బారిన పడి చికిత్స చేయించుకున్న ఇద్దరు ప్లేయర్లు కూడా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ లో తెగ కష్టపడుతున్నారు. ఇక ఇటీవల రాహుల్ శ్రేయస్ ఆసియా కప్ అందుబాటులో ఉంటారని కోచ్ రాహుల్ ద్రవిడు కూడా చిన్న హింట్ ఇచ్చాడు. కాగా ఈనెల 30వ తేదీ నుంచి ఆసియా ఒక ప్రారంభం కానుండగా.. మరో రెండు రోజుల్లో అటు భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి