మనం ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కాని అద్దెకు ఉంటున్న ఇల్లు కాని తగలబడిపోతుంటే చూస్తూ ఊరుకుంటామా.. కాని ఇదేం విడ్డురమో గాని ఏకంగా ఓ మహిళ తన నీడ లాంటి ఇంటికే నిప్పు పెట్టింది. నిప్పు పెట్టడమే కాకుండా.. గార్డెన్‌లో కూర్చీ వేసుకుని దర్జాగా కూర్చొని చిల్ అవుతూ రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా తన సొంత ఇల్లు కాలిపోతుంటే.. దాన్ని వినోదంలా చూస్తుండిపోయింది. ఆ ఇంట్లో మరో మహిళ ఉండగానే ఆమె ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఇదంతా ఇరుగుపొరుగువారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ ఘటన మేరీల్యాండ్‌లోని సెసిల్ కౌంటీ‌లో చోటుచేసుకుంది. మెట్వాలీ అనే 47 ఏళ్ల మహిళ ఇంట్లో ఎవరితోనో గొడపడింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె ఇంటికి నిప్పు పెట్టి.. గార్డెన్‌లో దార్జాగా కూర్చొని, పుస్తకం చదువుతూ టైంపాస్ చేసింది. ఇది గమనించిన ఇరుగు పొరుగు ప్రజలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. నిప్పంటుకున్న ఆ ఇంట్లో మరో మహిళ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమె ఇంటి నుంచి బయటకు రావాలని కేకలు వేశారు. లక్కీగా ఆమె కిటికీ తెరుచుకుని బయటకు వచ్చేసి బ్రతికి బట్టకట్టింది.


ఇక ఈ ఘోరమైన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం అక్కడికి చేరుకున్నారు. ఇంటికి నిప్పు పెట్టిన మెట్వాలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చేసరికే ఇల్లు సగానికి కాలిపోయింది. పోలీసులు మెట్వాలీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని పేర్కొన్నారు. ఆ ఇంట్లో నలుగురు నివసిస్తున్నారని, ప్రమాద సమయానికి ఇద్దరు బయటకు వెళ్లారని స్థానికులు తెలిపారు. ఒకరు లక్కీగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటను అవెరే హమ్మాండ్ అనే వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. మహిళపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: