మృగాలు అంటే అడవిలో ఉండేవి ఇప్పుడు మనముందు మనుషుల రూపంలో తిరుగుతున్నారు. దేశంలో ఎక్కడ చూసినా మానవ మృగాల బారిన పడిన ఆడవాళ్ల రోదనలు వినిపిస్తూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఓ చోట కామందుల దాహానికి అబలలే కాక చిన్నారులు సైతం బలవుతున్నారు. జనాల మధ్యే తిరుగుతూ.. కామంతో కళ్లు మూసుకుపోయి క్రూర జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస ఘటనలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ నవవధువుపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కొందరు.
గత శుక్రవారం వివాహమైన నవ వధువు, కోటి ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టగా, ఆ మరుసటి రోజే, ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన మూడు రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఠానా దేహాట్ ప్రాంతానికి చెందిన యువతికి ఓ యువకుడితో ఈ నెల 17న వివాహమైంది. అప్పగింతల తర్వాత ఆమెను అత్తారింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజే ఆమె కనిపించకుండా పోయింది. దీంత ఆమె అత్తమామలు యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పి అన్ని ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు.
దీంతో పోలీసులు ఆదివారం హాపూర్లోని ఓ బ్యాంకు కార్యాలయం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఇంటి నుంచి కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై సామూహిల లైంగిక దాడికి ఒడిగట్టారు. జరిగిన దారుణ ఘటనతో యువతి షాక్ కు గురై, ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. అయితే కొద్దిరోజుల్లో మామూలు స్థితికి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం అత్యాచారంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.