బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​కు కరోనా పాజిటివ్​ వచ్చింది. అమితాబ్​తో పాటు ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్​ బచ్చన్​కూ వైరస్​ సోకింది. ఈ విషయాన్ని అమితాబ్​, అభిషేక్ స్వయంగా వెల్లడించారు.ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం అందించామని తెలిపాడు అమితాబ్​. అనంతరం కుటుంబ సభ్యులతో పాటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ఈ బాలీవుడ్​ నటులు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. చికిత్స నిమిత్తం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరారు.అభిమానాలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని కోరాడు అభిషేక్​.

అమితాబ్​, అభిషేక్​కు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్​ తోపే తెలిపారు. వారి కుటుంబ సభ్యులు జయా బచ్చన్​, ఐశ్వర్యరాయ్​ బచ్చన్​కూ పరీక్షలు నిర్వహించామని, వారి ఫలితాలు ఆదివారం ఉదయం వస్తాయని స్పష్టం చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: