ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి రెచ్చిపోయారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్ చేయడం అంటే కొడాలి నానికి ఎంతో ఇష్టం... ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా వైరస్ కట్టడి విషయంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉందని కేంద్ర నుంచి పలువురు మెచ్చుకుంటున్నారని.. అలాంటి ఏపీ విషయంలో ఉమా గాడు, చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి చూపించిన దారిలో నడుస్తూ జగన్మోహన్రెడ్డి గారు కష్టపడి ఈ స్థాయికి వచ్చారని. అంతే కాని మీలా మీడియా గొట్టాలను నమ్ముకుని పనికి మాలిన పని చేయలేదని విమర్శించారు. ఇక శవాలను చూస్తే చంద్రబాబుకే ఉత్సాహం వస్తుందని.. ఈ ఉమాగాడు
చంద్రబాబును చూసి నేర్చుకోమని చెపుతుంటాడని.. వీడు ఒక తీసేసిన తహసీల్దార్ అని విమర్శించారు. అంతే కాకుండా పార్టీ పెట్టి మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచాడని.. అది చూసి నేర్చుకోవాలా ? అని ప్రశ్నించారు.
అలాగే ఓ అన్న చస్తే వదినను బాత్రూమ్లో ఎలా ఉరి తీయాలి అన్న కుట్ర ప్లాన్లు వేసిన ఉమా గాడిని చూసి నేర్చుకోవాలా ? అని ప్రశ్నించారు. ఈ తీసేసిన తహసీల్దార్ గాడు... సొల్లు కబుర్లు చెపుతున్నాడు... ఈ ముండ నిన్నొచ్చాడు.. మరోసారి సీఎం జగన్ గురించి ఏకవచనంతో మాట్లాడితే నీ మూతపగలగొడతా ? అని వార్నింగ్ ఇచ్చారు.