ఒక పక్క కరోనా వైరస్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే జనాల్లో మాత్రం మార్పు అనేది రావడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కరోనా వస్తుంది సామాజిక భౌతిక దూరం పాటించాలి అని ఎవరు చెప్పినా సరే జనాలు మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కరోనా ఎందుకు వస్తుందో తెలిసి కూడా ఎవరూ మాట వినే పరిస్థితి లేదు.
తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక సంఘటన జరిగింది. అది ఏంటీ అంటే... కట్నిలో ఆధ్యాత్మిక నాయకుడైన దేవ్ ప్రభాకర్ శాస్త్రి 'దాదా జి' అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సామాజిక దూరం అనేది లేకుండా హాజరు అయ్యారు. అసలు ఈ వేడుకలు నిర్వహించడంపై పోలీసుల నుంచి కూడా ఏ స్పందన లేదు అనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి.
Madhya Pradesh: people in huge numbers attended the funeral of Dev prabhakar Shastri 'Dadda ji', a spiritual leader in Katni, yesterday. #Lockdown4 pic.twitter.com/wVRSybFP77
— ANI (@ANI) May 19, 2020